న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కేంద్రంలోని బీజేపీ తరచుగా కాంగ్రెస్ నేత రాహు ల్ గాంధీని ‘పప్పు’ అని వెక్కిరిస్తూ ఉం టుంది. ఇప్పుడు అదే మాటను కేంద్రంపైకి తిప్పికొట్టి ఎద్దేవా చేశారు తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి కల్పనా సామర్థ్యం దిగజారిపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆమె ‘ఇప్పుడు పప్పు ఎవరయ్యారు?’ అని నిలదీశారు. లోక్సభలో సోమవారం 2022-23 అదనపు పద్దుల చర్చ సందర్భంగా ఆమె కేంద్రం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ వృద్ధి గురించి నరేంద్రమోదీ సర్కారు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పతనమైపోతున్నదని, అదుపు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు సూచించారు.