న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ సంస్థ.. కోవిడ్ కోసం కోర్బ్వ్యాక్స్ ( Corbevax) టీకాలను తయారు చేస్తున్నది. ప్రస్తుతం కోర్బ్వ్యాక్స్ టీకాల పురోగతి వేగంగా జరుగుతున్నట్లు ఆ కంపెనీ ఎండీ మహిమా ధాట్ల తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ కేంద్ర ఆరోగ్యశాక మంత్రి మన్సూక్ మాండవీయను కలిశారు. బయోలాజికల్-ఈ సంస్థ ఎండీ మహిమ ఇవాళ తనను కలిసినట్లు మంత్రి మాండవీయ తన ట్విట్టర్లో తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం బీఈ సంస్థకు పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
అమెరికాకు చెందిన బేయర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్తో కలిసి బీఈ సంస్థ కోర్బ్వ్యాక్స్ టీకాలపై ట్రయల్స్ నిర్వహించింది. కోర్బ్వ్యాక్స్ ఓ ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్. ఇది సాధారణంగా వ్యాక్సిన్ల తయారీకి వాడే టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. హెపిటైటిస్ బీ, హెచ్పీవీ వ్యాక్సిన్లకు ఇదే టెక్నాలజీ వాడుతుంటారు.
జూన్ 3వ తేదీన బయోలాజికల్ ఈ సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ డీల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఆ సంస్థ సుమారు 30 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన గవిలో మహిమ ధాట్ల సభ్యురాలు.