ముంబై : మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో కలిపి మొత్తం 108కి పెరిగింది. ఇందులో 54 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 378కి చేరాయి. రోజులు గడుస్తున్నా కేసులు పెరుగుతున్న కొద్ది ఆందోళన వ్యక్తమవుతున్నది. రాబోయే రోజుల్లో మరింత కేసులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో పలు రాష్ట్ర అప్రమత్తమై ఆంక్షలు విధించాయి. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.