హైదరాబాద్: రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో తనతోపాటు కలిసి పనిచేసిన గతాన్ని స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మన్గా పనిచేసిన ముత్యంరెడ్డి.. తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మెదక్ జిల్లా ఓ ఆదర్శ నేతను కోల్పోయిందని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాసవిడిచారు. ఆయన స్వస్థలం చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామం. 1978లో రామాయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1980లో ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య కోసం ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..