ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్లైన్ ముగియడంతో.. ఆ పార్టీ కార్యకర్తలు అజాన్ ఇస్తున్న మసీదుల వద్ద ఛాలీసా ఆలపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో రిలీజైంది. ఓ భారీ బిల్డింగ్పైన నిలుచున్న ఓ వ్యక్తి తన వద్ద ఉన్న లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశాడు. అతని చేతిలో ఎంఎన్ఎస్ పార్టీ జెండా కూడా ఉంది. ఇక ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో అజాన్ కూడా వినిపిస్తున్నట్లు ఉంది.
థానే సిటీలో ఉన్న ఇందిరా నగర్లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు హనుమాన్ ఛాలీసాను లౌడ్ స్పీకర్లో ప్లే చేశారు. అయితే ఆ సమీపంలో ఎటువంటి మసీదు లేదు. బుధవారం నుంచి ఎక్కడైతే మసీదుల్లో అజాన్ వినబడుతుంతో అక్కడ హనుమాన్ ఛాలీసా ప్లే చేయాలని రాజ్ థాకరే పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో రాజ్ థాకరేను హౌజ్ అరెస్టు చేశారు. ఒకవేళ అజాన్ సౌండ్ వల్ల డిస్టర్బ్ అయితే అప్పుడు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కూడా రాజ్ థాకరే కోరారు.
రాజ్ థాకరే వార్నింగ్తో ప్రస్తుతం ముంబైతో పాటు మహారాష్ట్ర అంతటా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూణెలో ఉన్న పూనేశ్వర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసుల్ని మెహరించారు. ఆ ఆలయంలో మహా ఆరతి నిర్వహించనున్నట్లు ఎంఎన్ఎస్ పేర్కొన్నది.