ముంబై: ఒక మంత్రి తన అధికారాన్ని ప్రజలపై ప్రదర్శించాడు. పోలీసుల ఎదుటే ఇద్దరు వ్యక్తులను దుర్భాషలాడటంతోపాటు వారి చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. శివసేన రెబల్ వర్గానికి చెందిన దాదా భూసే, సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఓడరేవులు, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల ఆయన ఒక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులపై ఆ మంత్రితోపాటు ఆయన అనుచరులు తమ దర్పాన్ని ప్రదర్శించారు. పోలీసుల ముందే ఆ వ్యక్తులను తిట్టడంతోపాటు చెంపలపై కొట్టారు.
కాగా, ఎస్పీపీ నేత జితేంద్ర అవద్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మంత్రి దాదా భూసే పోలీసుల ముందే ప్రజలను తిట్టడంతోపాటు వారిని కొట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి, పోలీసులు ఆ మంత్రిపై ఏం కేసు నమోదు చేస్తారు? అని అందులో ప్రశ్నించారు. అలాగే బీజేపీ నేత తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆయన మండిపడ్డారు. మరోవైపు మంత్రి దాదా భూసే ఇద్దరు వ్యక్తులను తిట్టడంతోపాటు వారి చెంపలపై కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मंत्री दादा भूसे फटकावतात .
शिव्या देतात
मुख्यमंत्री साहेब
कुठला गुन्हा पोलिस घेणार
पोलिसां समोर मारले
माझा नग्न फोटो fb वर टाकणाऱ्याला आपण मांडीवर बसवलत #सीबीआय चौकशी लागावी म्हणून वकिलांची फौझ उभी केलीत supreme court मध्ये
रात्री त्या विकृत बरोबर आपली बैठक
आता बोला .. pic.twitter.com/EGsJmvApfI— Dr.Jitendra Awhad (@Awhadspeaks) December 26, 2022