న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్గా ఎంపికైన మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ సదానంద వసంత్ నియమితులయ్యారు. 2026 డిసెంబర్ 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎన్ఐఏ ప్రస్తుత చీఫ్ దినకర్ గుప్తా పదవీకాలం మార్చి 31తో ముగియనున్నది.
26/11 ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన సదానంద్కు రాష్ట్రపతి పోలీస్ మెడల్ కూడా దక్కింది. రాజస్థాన్ క్యాడర్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజీవ్కుమార్ ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్, డెవలప్మెంట్’కు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు యూపీకి చెందిన ఐపీఎస్ అధికారి పీయూష్ ఆనంద్ను కొత్త చీఫ్గా నియమించారు. అలాగే ఎస్పీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా కేరళ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఎస్ సురేశ్ నియమితులయ్యారు.