Ram Temple Opening : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న పబ్లిక్ హాలిడేను ప్రకటించింది. రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కార్యక్రమాలకు సెలవు ఇచ్చే ఆనవాయితీ లేదని అంతకుముందు ఈ వినతిని రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ తోసిపుచ్చింది.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కార్యాలయానికి విజ్ఞప్తిని పంపడంతో అత్యున్నత స్ధాయిలో పబ్లిక్ హాలిడేపై నిర్ణయం తీసుకున్నారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలు, పారిశ్రామిక సంస్ధలకు హాఫ్ డే సెలవు ప్రకటించిన నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, గోవా ప్రభుత్వాలు 22న ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించాయి. ఇక అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 22న మాంసం, మద్యం విక్రయాలు నిలిపివేస్తూ పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఇక త్రిపురలో జనవరి 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read More :
Attacked the girl | ప్రేమించాలంటూ బాలికపై కత్తితో దాడి.. ఆపై రైలుకింద పడి తాను ఆత్మహత్య