ముంబై: మహారాష్ట్ర సీఎం, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే గోవా హోటల్లోని రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై విమానాశ్రయానికి శనివారం రాత్రి చేరుకున్నారు. అనంతరం వారితో కలిసి బస్సులో ఒక హోటల్కు వెళ్లారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. ఆదివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం షిండే నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా, గురువారం ప్రత్యేక విమానంలో ఒంటరిగా గోవా నుంచి ముంబైకి వచ్చిన ఏక్నాథ్ షిండే అనూహ్యంగా ఆ సాయంత్రం సీఎంగా, బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండే నాటి నుంచి ముంబై టు గోవాకు షెటిల్ సర్వీస్ చేస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గురువారం రాత్రి గోవా చేరుకున్నారు. అక్కడి రెబల్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. అనంతరం రాత్రికి గోవా హోటల్కు వెళ్లారు.
మరోవైపు శనివారం మధ్యాహ్నం గోవాలోని హోటల్ను రెబల్ ఎమ్మెల్యేలు ఖాళీ చేశారు. సీఎం షిండే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక బస్సులో ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో ఆదివారం, సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు కూడా సీఎం షిండే రెబల్ ఎమ్మెల్యేల వెంటే ఉండనున్నారు.
#WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde along with his faction of Shiv Sena MLAs after they arrived at Mumbai Airport from Goa pic.twitter.com/b7MfybsVha
— ANI (@ANI) July 2, 2022