ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. సోమవారం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అనూహ్య పరిణామాల మధ్య గురువారం రాత్రి ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం మాజీ సీఎం ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేయడంతో మహా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ మొదలైంది.