ముంబై: మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పేందుకు కొత్తకొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను ముంబై పోలీస్ డిపార్టుమెంట్లోని యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారు.
మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్ను నింపి మజ్గావ్కు చెందిన కొందరు సప్లయ్ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు రైడ్ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు సీజ్ చేసిన మత్తు మందు విలువ రూ.22 లక్షలు ఉంటుందన్నారు.