ముంబై: మనం ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి విన్నాం.. చూశాం. కానీ ఒక్క విద్యార్థి కోసమే నడుస్తున్న పాఠశాలలను ఎక్కడైనా చూశామా. అవును ఇది నిజమే. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ సర్కారు బడి ఒక్క విద్యార్థి కోసమే నడుస్తున్నది. అదీ ఒక్క రోజు కూడా బంద్ కాకుండా. అతని కోసం ఓ ఉపాధ్యాయుడు రోజూ 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు.
వాషిమ్ జిల్లాలోని గణేశ్పూర్లో 150 మంది నివసిస్తున్నారు. గ్రామంలో జిల్లాపరిషత్ ప్రాథమిక పాఠశాల ఉన్నది. అందులో ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్లో కార్తిక్ షెగ్కర్ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. ఒక్కడే విద్యార్థి ఉన్నాడని స్కూల్ను ఇతర ప్రాంతాలకు తరలించకుండా.. అతనికోసమే జిల్లా యంత్రాంగం దానిని నడిపిస్తున్నది. మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు కల్పిస్తున్నది. స్కూల్లో కిశోర్ మన్కర్ అనే టీచర్ పనిచేస్తున్నారు.
తానే అతన్ని సబ్జెక్టులు బోధిస్తున్నానని కిశోర్ చెప్పారు. కార్తిక్ ప్రతిరోజూ స్కూల్కి వస్తాడని, ఇద్దరం కలిసి ఉదయాన్నే ప్రార్థన చేస్తామన్నారు. అతని కోసం పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. రెండేండ్ల నుంచి అతనొక్కడే పేరు నమోదుచేసుకుంటున్నాడని వెల్లడించారు.
Maharashtra | A Zilla Parishad primary school in Ganeshpur village of Washim district runs only for one student
Population of the village is 150. There is only one student enrolled in the school for the last 2 years. I'm the only teacher in school: Kishore Mankar, school teacher pic.twitter.com/h6nOyZXlDf
— ANI (@ANI) January 23, 2023