న్యూఢిల్లీ: టికెట్ ధర చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో నడిచే మహారాజా ఎక్స్ప్రెస్ టికెట్ ధర జీఎస్టీ మినహా 19.9 లక్షలు. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలుంటాయి. లివింగ్ రూం, లగ్జరీ బాత్రూంతో కూడిన బెడ్రూంతో పాటు మరో గది కూడా ఉంటుంది. ఇది ఉత్తరం నుంచి పశ్చమానికి, మధ్య భారతంలో నాలుగు మార్గాల గుండా ప్రయాణిస్తుంది.