ప్రయాగ్రాజ్: అఖిల భారతీయ అఖాడా పరిషద్ చీఫ్గా 35 ఏళ్ల మహంతి బల్బీర్ గిరి పీఠాధిపత బాధత్యలు దక్కనున్నాయి. సాంప్రదాయం ప్రకారం అక్టోబర్ 5వ తేదీన మహంతి బల్బీర్ గిరికి బాధ్యతలు అప్పగిస్తారు. ఇటీవల అనుమానాస్పద రీతిలో మరణించిన మహంతి నరేంద్ర గిరి చివరి కోరిక మేరకు బల్బీర్ గిరికి పీఠాన్ని అప్పగించనున్నారు. నరేంద్ర గిరి మరణించిన 16వ రోజున ఆ వేడుకను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20వ తేదీన మఠంలో మహంతి నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కేసులో ఇద్దరు సాధువులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.