చెన్నై, డిసెంబరు 19: రూ.1.75 కోట్లు అక్రమంగా కూడబెట్టారన్న కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కే పొన్ముడి, భార్య పీ విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు దోషులుగా తేల్చింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ జీ జయచంద్రన్ తీర్పునిస్తూ మంత్రి, ఆయన భార్యను దోషులుగా నిర్ధారించారు.
డిసెంబర్ 21న కోర్టులో లొంగిపోవాలని, అనంతరం శిక్షపై తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. ఈ క్రమంలో గతంలో వారిని నిర్దోషులుగా పేర్కొంటూ విల్లుపురం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.