భోపాల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌధరి స్పృహ తప్పి పడిపోయారు. రాయ్సెన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన సీఎం సందేశాన్ని చదువుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో అక్కడున్న అధికారులు, నాయకులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు వెంటనే మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. షుగర్, బీపీ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆయన పడిపోయారని చెప్పారు. కాసేపటి తర్వాత మంత్రి నడుచుకుంటూ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చారు. ఎక్కువసేపు నిలబడి ఉండటంవల్ల తాను స్పృహ తప్పానని, తనకు ఇప్పుడు అంతా బాగానే ఉందని ఆస్పత్రి ముందు ఆరా తీసిన విలేకరులకు ఆయన చెప్పారు.