భోపాల్: రాజ కుటుంబానికి చెందిన మహిళను ఒక గుడి నుంచి పోలీసులు ఈడ్చుకెళ్లారు. (Royal Woman Dragged Out Of Temple) ఆలయ నిబంధనలను ఆమె ఉల్లంఘించిందని ఆరోపించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు ఆ మహిళను అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుందేల్ఖండ్ ప్రాంతంలోని ప్రముఖ క్షేత్రమైన జుగల్ కిషోర్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఆలయ ఆచారం ప్రకారం పన్నా రాజకుటుంబానికి చెందిన మగవారు మాత్రమే గుడి శుభ్రతా, పూజా కార్యక్రమాల్లో పాల్గోవాలి.
కాగా, కుమారుడు అందుబాటులో లేకపోవడంతో ఆ రాజ కుటుంబానికి చెందిన జితేశ్వరి దేవి ఆ ఆలయానికి వచ్చింది. దేవుడి విగ్రహానికి హారతి ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కిందపడిపోయిన ఆమెను పక్కకు ఈడ్చుకెళ్లారు. గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి ఆలయ నిబంధనలను ఉల్లంఘించిందన్న అనుమానంతో పోలీసులు ఆమెను గుడి నుంచి బయటకు లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు అరెస్ట్ సందర్భంగా మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై జితేశ్వరి దేవి మండిపడింది. పన్నా రక్షణ సంక్షేమ నిధిలో రూ.65,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై తాను గళమెత్తడం వల్లనే ప్రభుత్వం తనను అరెస్ట్ చేయించినట్టు ఆమె విమర్శించింది.
The beauty of Sanatan Dharma, A widow was stopped & dragged out from performing Aarti in Krishna temple of Panna. The woman belongs to the Royal family of Panna. pic.twitter.com/Pq6U9GX0Dc
— The Dalit Voice (@ambedkariteIND) September 8, 2023