భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అనుమతించదగిన స్థాయికి మించి శబ్దం వెలువడే విధంగా లౌడ్స్పీకర్లను ఉపయోగించరాదని ఆదేశించారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న మొదటి నిర్ణయం ఇది. రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ (హోం) డాక్టర్ రాజేశ్ రజోరా మాట్లాడుతూ, సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా లౌడ్స్పీకర్లను ఉపయోగించడంపై మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలను కూడా ప్రభుత్వం నిషేధించింది.