Bhopal | భోపాల్: మూడో కాన్పులోనూ భార్య ఆడపిల్లనే కన్నదన్న కోపంతో ఒక భర్త అప్పుడే పుట్టిన కుమార్తెను నేలకేసి కొట్టి చంపిన అమానుష ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్ణాపూర్ దెహత్కు చెందిన షాబూ, ఫర్హాన్ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మే 31న మూడో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన ఫర్హాన్ ఆడశిశువును నేలకేసి కొట్టడంతో శిశువు మృతిచెందింది.
మొదట ఫిర్యాదు చేసిన షాబూ తల్లి ఆ తర్వాత కేసు వాపసు తీసుకుంది. అనారోగ్యంతో శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పడం గమనార్హం.