భోపాల్: పెండ్లి కోసం కారులో వెళ్తున్న వరుడు, డ్రైవర్కు కరోనా సోకింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఆ జిల్లాలో వివాహ కార్యక్రమాలను నిషేధించారు. మరోవైపు వివాహం కోసం రెండు వాహనాల్లో ఊరేగింపుగా వెళ్తున్నపెండ్లి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైద్య సిబ్బందితో వారికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష జరిపించారు. వరుడితోపాటు కారు డ్రైవర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన పెండ్లి బృందంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.