భోపాల్: మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) హిజబ్ (Hijab) వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దమోహ్ (Damoh) జిల్లా కేంద్రంలోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్లో (Ganga Jamuna Higher Secondary School) విద్యార్థినులకు పాఠశాల యాజమాన్యం హిజబ్ తప్పనిసరి (Compulsory Hijab) చేసింది. అది ఏ వర్గం వారైనా హిజబ్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కూల్పై చర్యలు తీసుకున్నది. విద్యార్థులను హిజబ్ ధరించేలా ఒత్తిడి చేస్తున్నందుకు గాను పాఠశాల గుర్తింపును రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
నిబంధనలు అతిక్రమించినందుకుగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan) తెలిపారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అలాంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మధ్యప్రదేశ్లో అలాంటి పనులకు స్థానం లేదని స్పష్టం చేశారు. దమోహ్ వంటి స్కూళ్లను మూసివేస్తామని చెప్పారు.