భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging). కట్నీ జిల్లా (Katni) కౌరియాకు (Kauriya) చెందిన చైనా బాయ్ కచి (Chaina Bai Kachi) అనే మధ్య వయస్కురాలైన మహిళ స్థలంలో అధికారులు విద్యుత్ టవర్ను (Electricity tower) ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆమెకు నష్ట పరిహారం (Compensation) ఇవ్వకుండానే టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో తన బంధువులతో కలిసి పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు (Police).. ఆమెను జుట్టు పట్టి అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. దీనినంతటినీ అక్కడున్నవారు తమ ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పంధించారు.
టవర్ నిర్మాణ పనులు అడ్డుకోవడంతోనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, చట్టప్రకారమే వ్యవహరించామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కేడియా (Manoj Kedia) వెల్లడించారు. అది పాత వీడియో అని చెప్పారు. అయితే తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టారని బాధితురాలు వాపోయారు. కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.