భోపాల్: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎమ్మెల్యేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Chouhan) ధన్యవాదాలు తెలిపారు. ద్రౌపది ముర్మును తదుపరి రాష్ట్రపతిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. భారత 16వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. గిరిజన కమ్యునిటీకి చెందిన ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికయ్యారు. ఇది చాలా గర్వించదగిన విషయం అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ధనవాదాలు తెలిపారు.
కాగా, ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో 17 మంది ఎంపీలు, 104 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. వీరిలో అత్యధికులు మధ్యప్రదేశ్కు చెందినవారే ఉన్నారని అంచనా వేస్తున్నారు.
राष्ट्रपति पद के लिए मध्यप्रदेश से श्रीमती द्रौपदी मुर्मू जी को भारतीय जनता पार्टी के अतिरिक्त भी वोट मिले हैं।
मैं अन्य दलों के उन विधायक साथियों को, जिन्होंने अंतरात्मा की आवाज पर श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाने के लिए वोट किया है, उनको हृदय से धन्यवाद देता हूं। pic.twitter.com/pEWiY4O50Y
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 21, 2022