భోపాల్: అందరూ చూస్తుండగా బీజేపీ మంత్రి ఉన్నట్టుండి ఆయన ధరించిన కుర్తా విప్పారు. ఆ తర్వాత నీటితో తన చేతులను కడుక్కున్నారు. ఎవరో ఆయనపై దురదాకు పౌడర్ చల్లారు. దీంతో దురదను భరించలేకపోయిన ఆయన ఏకంగా కుర్తా విప్పేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి వికాస్ యాత్రను ప్రారంభించారు. దీంతో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వికాస్ యాత్రలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన నియోజకవర్గమైన ముంగాలిలో మంగళవారం వికాస్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక గ్రామంలో మాట్లాడిన ఆయనపై ఎవరో దురద పౌడర్ చల్లారు. ఆ దురదను భరించలేకపోయిన మంత్రి తన కుర్తాను విప్పారు. వాటర్ బాటిల్లోని నీటితో దురుద పెడుతున్న చేతిని కడుక్కున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, రెండు రోజుల కిందట బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర వర్మకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేపట్టిన వికాస్ యాత్రను ఒక గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయకపోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ కంటే దారుణంగా బీజేపీ పాలన ఉందని విమర్శించారు. రోడ్డు వేయకపోతే ఓట్లు వేయబోమంటూ బీజేపీ ఎమ్మెల్యేను ఆ గ్రామ పెద్ద హెచ్చరించారు.
Madhya Pradesh Minister Removes Kurta, Washes Himself At BJP Event. Reason Is… https://t.co/j4Soh1q9Es pic.twitter.com/25g2Q4Bsgg
— NDTV (@ndtv) February 10, 2023