న్యూఢిల్లీ: బీజేపీ గెలిచిన ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు(Gaumutra States) అని డీఎంకే ఎంపీ సెంథిల్కుమార్ మంగళవారం లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ ఆయన చెప్పారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను దెబ్బతీసినా.. ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటున్నట్లు సెంథిల్ తెలిపారు. అనాలోచితంగా తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు.
ఎంపీ సెంథిల్కుమార్కు సీఎం స్టాలిన్ వార్నింగ్ ఇచ్చినట్లు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తెలిపారు. సెంథిల్ చేసిన వ్యాఖ్యలు సరికాదు అని స్టాలిన్ చెప్పినట్లు బాలు పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో జమ్మూకశ్మీర్ బిల్లులపై చర్చ జరిగిన సమయంలో సెంథిల్ మాట్లాడుతూ.. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ విమర్శించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు.
#WATCH | Winter Session of Parliament | DMK MP DNV Senthilkumar S expresses regret over his ‘Gaumutra’ remark and withdraws it.
“The statement made by me yesterday inadvertently, if it had hurt the sentiments of the Members and sections of the people, I would like to withdraw… pic.twitter.com/S0cjyfb7HU
— ANI (@ANI) December 6, 2023