వారణాసి: ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఇవాళ మాతా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. వందేళ్ల క్రితం కాశీ ఆలయం నుంచి చోరీ అయిన ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఆ అరుదైన అన్నపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న ఆ విగ్రహాన్ని.. కాశీ తీసుకువచ్చేందుకు యాత్రను కూడా చేపట్టారు. అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఇండియాకు తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీకి యూపీ సీఎం థ్యాంక్స్ తెలిపారు. 108 ఏళ్ల తర్వాత అన్నపూర్ణ విగ్రహం కాశీకి మళ్లీ వచ్చిందని, ఈ క్రెడిట్ అంతా కాశీ ఎంపీతో పాటు ప్రధాని మోదీకి దక్కుతుందని, కాశీ ప్రజల తరపున, రాష్ట్రం తరపున ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు సీఎం యోగి తెలిపారు. అత్యంత అరుదైన 18వ శతాబ్ధానికి చెందిన అన్నపూర్ణ విగ్రహం 17 సెమీ ఎత్తు, 9 సెమీ వెడల్పుతో ఉంది. కేంద్ర మంత్రి కిషణ్రెడ్డి ఆ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించారు.