కొచ్చి: కేరళ సీఎం ఆఫీసులో పనిచేసిన మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. లైఫ్ మిషన్ స్కామ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తొలి అరెస్టు ఇదే. లైఫ్ మిషన్ ప్రాజెక్టు కింద త్రిసూర్ జిల్లాలోని వాడకంచెరిలో 140 కుటుంబాల కోసం ఇండ్లను నిర్మించాలి. ఈ స్కీమ్కు 14.50 కోట్లు యూఏఈ కౌన్సులేట్ ద్వారా అందాయి. దాంట్లో స్వప్నా సురేశ్ సుమారు 4.48 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ స్కీమ్లో మాజీ సీఎస్ శివశంకర్ హస్తం ఉన్నట్లు నిందితురాలు స్వప్నా సురేశ్, సరిత్ ఆరోపించారు. లైఫ్ మిషన్ ప్రాజెక్టులో గత మూడు రోజుల నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతోంది. శివశంకర్ను ప్రశ్నించిన ఈడీ నిన్న రాత్రి 11.4 5 నిమిషాలకు ఆయన్ను అరెస్టు చేశారు. మెడికల్ చెకప్ తర్వాత ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ముందు శివశంకర్ను ప్రజెంట్ చేస్తారు.