శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పులు, ఎన్కౌంటర్లతో నిత్యం దద్దరిల్లే జమ్ముకశ్మీర్లోని షోపియాన్ను 15 కార్ప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే, విక్టర్ ఫోర్స్ జీవోసీ మేజర్ జనరల్ రషీమ్ బాలితో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. బత్పురా చౌక్ వద్ద రద్దీగా ఉండే వీధులలో వారు నడిచారు. అధికారులు, స్థానికులు, వ్యాపారులతో పాండే మాట్లాడారు. కొందరితో సెల్ఫీ దిగారు. దీపావళి సందర్భంగా స్వీట్లు బహుకరించారు.
జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదులు ఇటీవల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో 15 కార్ప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే, విక్టర్ ఫోర్స్ జీవోసీ మేజర్ జనరల్ రషీమ్ బాలి కలిసి షోపియాన్ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.