మూడు నెలల్లో నాలుగోసారి
గడిచిన మూడు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ఇది నాలుగోసారి. జూలైలో ఒక్కో సిలిండర్పై రూ. 25.50, ఆగస్టు 17న రూ. 25, సెప్టెంబర్ 1న రూ. 25ను పెంచారు. మరోవైపు, 19 కిలోల వాణిజ్య సిలిండర్పై అక్టోబర్ 1న రూ. 43ను పెంచారు. దీంతో ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ. 1,793కు చేరింది.
మళ్లీ భగ్గుమన్న పెట్రోలు, డీజిల్
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 102.94, లీటరు డీజిల్ రూ. 91.42కు చేరుకున్నది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 108.96గా ఉండగా, లీటరు డీజిల్ ధర రూ. 99.17కు చేరింది. గడిచిన మూడు వారాల్లో పెట్రోల్ రేటును పెంచడం ఇది ఏడోసారి కాగా, డీజిల్ రేటును పెంచడం ఇది పదోసారి.
మోదీ ఏడేండ్ల పాలనలో వంటింట్లో మంట పెరిగిందిలా..