శబరిమల: మలయాళ నూతన సంవత్సరం విషు పర్వదినం సందర్భంగా ఈ నెల 14 నుంచి స్వామి అయ్యప్ప బొమ్మతో బంగారు లాకెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వివరాల ప్రకారం, 1, 2, 4, 8 గ్రాముల బరువు గల బంగారు లాకెట్లను www.sabarimalaonline.org ద్వారా ఆన్లైన్లోనూ, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద విక్రయిస్తారు. ఈ లాకెట్లను అయ్యప్ప స్వామి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేసి, అమ్ముతారు.