కాన్ఫూర్తో కొత్త దొంగలు వచ్చారు. వారి పేరు నిమ్మకాయల దొంగలు. ఈ రోజుల్లో నిమ్మకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిమ్మకాయలు ఎవరైనా కొంటే.. ఈ జమానాలో వాడు లక్షాధికారి కిందికే లెక్క. దీంతో నిమ్మకాయ ధరలు ఏ రేంజ్లో వున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ గమనించి.. కొత్తగా నిమ్మకాయ దొంగలు ఉద్భవించారు. దాదాపు 15 వేల నిమ్మకాయలను ఓ దొంగల ముఠా కాన్ఫూర్లోని తోటలోంచి దొంగలించింది. దీంతో యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనం తర్వాత నిమ్మకాయల తోటకు ఓ గార్డును సెక్యూరిటీగా కూడా పెట్టుకున్నాడు ఆ యజమాని.
కాన్పూర్లోని చౌబేపూర్, బిటూర్ కటారీ, మంధనా, పరియర్ ప్రాంతాల్లో నిమ్మకాయ తోటలు విపరీతంగా వున్నాయి. ఈ ప్రాంతాల్లో నిమ్మకాయ సాగు అధికంగా వుంటుంది. ఈ దొంగతనం నేపథ్యంలో ఈ తోటల యజమానులు అందరూ సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారు. ఇలా నిమ్మకాయ తోటలకు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం ఇదే ప్రథమం. నిమ్మకాయల దొంగలు కొత్తగా పుట్టుకొచ్చారని, దీంతో తమ తోటలకు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాల్సి వస్తోందని యజమానులు పేర్కొన్నారు.