న్యూఢిల్లీ : లండన్ వెళ్లే విమానం టేకాఫ్ తీసుకునేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నది. ఇంతలో ఆ విమానంలోని బిజినెస్ క్లాస్లో చీమల దండు కనిపించింది. దాంతో బిజినెస్ క్లాస్లోని గొప్పొళ్లంతా అయ్య బాబోయ్! అని అరిచారు. ఈ విమానంలోనే భూటాన్ రాజు లండన్ వెళ్తున్నారు. అప్పుడు ఏంచేశారంటే..
న్యూఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు ఏయిరిండియా విమానం (Air India Flight) టేకాఫ్ తీసుకునేందుకు కొన్ని నిమిషాల ముందు బిజినెస్ క్లాస్లో చీమల గుంపు కనిపించింది. ఈ క్లాస్లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చక్ ప్రయాణిస్తున్నారు. దాంతో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి వెంటనే మరో విమానాన్ని అరెంజ్ చేశారు. ఈ విమానంలో నుంచి సామాను ఇంకో విమానంలోకి మార్చడానికి విమానాశ్రయం సిబ్బందికి నాలుగైదు గంటల సమయం పట్టిందంట.
జూలై నెలలో సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిరిండియా విమానం విండ్షీల్డ్లో పగుళ్లు గుర్తించడంతో కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అలాగే, మే నెలలో అమెరికాలోని నెవార్క్ వెళ్లే ఎయిరిండియా విమానం లోపల గబ్బిలం కనిపించడంతో విమానాన్ని టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
ఎర్ర బెండకాయలండీ.. ఎంతో కాస్లీ.. ఎంతో హెల్దీ
మాజీ గవర్నర్పై రాజద్రోహం కేసు
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
ట్రిబ్యునల్స్ ఖాళీలు భర్తీ చేయకపోవడంపై ‘సుప్రీం’ ఆగ్రహం
బ్రిటన్ ఎంపీలకు కొత్త డ్రెస్ కోడ్
తేజ్ ప్రతాప్ ‘స్టూడెంట్ జన్శక్తి పరిషత్’ ప్రారంభం
తాలిబాన్ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య
లాహోర్ను ముట్టడించిన భారత సేనలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..