ముంబై, మార్చి 27 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. 2019లో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవనీత్ రాణా లోక్సభకు ఎన్నికయ్యారు. అలాగే చిత్రదుర్గ లోక్సభ స్థానం నుంచి కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ కార్జోల్ను బీజేపీ బరిలోకి దింపింది.
ఇక హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీని బీజేపీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పది మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.