భోపాల్ : మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నిర్ధిష్ట సడలింపులతో లాక్డౌన్ ను పొడిగించాలని మంగళవారం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని కేబినెట్ భేటీ అనంతరం శివరాజ్ చౌహాన్ వెల్లడించారు.
ఉజ్జయినిలో మార్కెట్లను సాయంత్రం ఏడు గంటల వరకూ తెరిచేందుకు అనుమతించామని చెప్పారు. ఖర్గోనేలో దుకాణాలను సరి బేసి పద్ధతిలో తెరుస్తారని, శివపురిలో రోజు మార్చి రోజు కుడి, ఎడమ వైపు దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్ లో సోమవారం 46 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు ఒక శాతం లోపు ఉండటంతో కరోనా కర్ఫ్యూకు సడలింపులు ఇచ్చారు.