బెంగళూరు: ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బులు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నేరస్తుడిగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 8 ఏళ్ల కిందట కుటుంబాన్ని వీడిన ఆ వ్యక్తి అడుక్కొని జీవిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో అతడ్ని కలిపారు. (man reunites with family) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురుసిద్దప్ప అనే వ్యక్తి వద్ద సుమారు రూ.60,000 ఉండటాన్ని స్థానికులు గమనించారు. అతడు నేరగాడు అయ్యి ఉంటాడని అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అతడి సంచి, వస్తువులను పోలీసులు తనిఖీ చేయగా భారీగా చిల్లర నాణేలు కనిపించాయి.
కాగా, గురుసిద్దప్పను పోలీసులు ప్రశ్నించారు. అతడి గురించి ఆరా తీయగా మాదాపుర గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. సుమారు ఎనిమిదేళ్ల కిందట కుటుంబ సభ్యులతో గొడవ వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి బెగ్గర్గా జీవిస్తూ సుమారు రూ.60,000 కూడబెట్టాడు.
మరోవైపు గురుసిద్దప్పకు భార్య, కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్న వారికి అతడి గురించి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన గురుసిద్దప్ప చివరకు ఊహించని విధంగా తన కుటుంబం చెంతకు చేరుకున్నాడు.