న్యూఢిల్లీ, జూలై 26: దేశవ్యాప్తంగా ఏడు హైకోర్టుల్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైందని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. గుజరాత్, గువాహటి, ఒరిస్సా, కర్ణాటక, ఝార్ఖండ్, పాట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైందని కేంద్రం తెలిపింది.