చండీగఢ్: గురుద్వారా పార్కింగ్ ప్లేస్లో లైవ్ బాంబ్ (Live Bomb)ను గుర్తించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకుంది. పంజాబ్లోని తారన్ తరన్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక దర్బార్ సాహిబ్ గురుద్వారా పార్కింగ్ ప్లేస్లో టీ అమ్ముకునే వ్యక్తి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఒక లైవ్ బాంబ్ను అతడు గుర్తించాడు. వెంటనే గురుద్వారా సిబ్బందిని అలెర్ట్ చేశాడు. దీంతో వారు పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు. బాంబ్ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గురుద్వారా వద్దకు చేరుకున్నారు. బాంబ్ గుర్తించిన ప్రాంతం నుంచి జనాన్ని ఖాళీ చేయించారు. ఆ వెంటనే బాంబులను నిర్వీర్యం చేసే బృందాన్ని అక్కడకు రప్పించారు.
కాగా, గురుద్వారాకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గుర్తించిన బాంబ్ను సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురుద్వారా వద్ద ఆ బాంబ్ను ఎవరు ఉంచారన్న దానిపై సిబ్బందిని ప్రశ్నించారు. ఖలీస్థాన్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ పరారీ నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.