అమ్రేలీ, ఆగస్టు 22: గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఢీకొని సింహం చనిపోయింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖడ్లాకా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయింది మగసింహం అని, వయస్సు 5-6 ఏండ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 2019, 2020లో గుజరాత్లో 313 సింహాలు చనిపోయాయి. వీటిలో 23 బావిలో పడటం, యాక్సిడెంట్లు లాంటి కారణాలతో సంభవించిన అసహజ మరణాలు. గిర్ వన్యప్రాణుల అభయారణ్యం గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే ఆసియాటిక్ సింహాలు ఉన్న ఏకైక అభయారణ్యం ఇదే.