లక్నో: రైలు స్లీపర్ కోచ్లో అనుమానాస్పద ఇనుప పెట్టెను పారిశుధ్య సిబ్బంది గుర్తించారు. తాళం పగులగొట్టి దానిని తెరిచి చూడగా మహిళ మృతదేహం భాగాలున్నాయి. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పెట్టె, బ్యాగులో ఉంచి రైలులో వదిలేసినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman’s Chopped Body On Train) ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. బీహార్లోని ఛప్రా నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్ రైలు, లక్నోలోని గోమతి నగర్ స్టేషన్లో ప్రయాణాన్ని ముగించింది.
కాగా, సోమవారం ఉదయం ఆ రైలు కోచ్లను పారిశుధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తుండగా ఒక స్లీపర్ కోచ్ సిటు కింద వదిలేసిన ఇనుప పెట్టె, ఒక బ్యాగ్ను వారు గుర్తించారు. రక్తం మరకలు ఉండటంతో అనుమానించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఇనుప పెట్టె తాళం పగులగొట్టి చూడగా మహిళ మృతదేహం భాగాలు ఉన్నాయి. మొండెం, వేరు చేసిన తల భాగాలు పెట్టెలో, కాళ్లు, చేతుల భాగాలను పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి బట్టల మధ్య దాచి బ్యాగ్లో ఉంచడాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు.
మరోవైపు మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఆమె గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన హంతకులు ఇనుప పెట్టె, బ్యాగులో వాటిని ఉంచి రైలులో వదిలేసినట్లు అనుమానించారు. ఆ రైలు ప్రయాణించిన అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Railway staff in Lucknow found a decapitated female torso (25-30 yrs) in a box & severed limbs in a bag inside a sleeper coach of a train from Chhapra via Gorakhpur to Gomti Nagar. FIR filed, post-mortem done, probe underway. Head missing, identification pending. pic.twitter.com/LFj1FU1icu
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 18, 2026