శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. బారాముల్లా జిల్లాలోని బన్నేర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని (Terrorist) భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో శనివారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు బన్నేర్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు.
అతడిని లష్కరే తొయిబాకు (LeT) చెందిన ఇర్షద్ అహ్మద్గా గుర్తించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అతడు పఠాన్కు చెందినవాడని, ఈ ఏడాది మే నుంచి ఈ ప్రాంతంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని చెప్పారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 30 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించార. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. కాగా, శనివారం ఉదయం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే.
J&K | One terrorist, identified as Irshad Ahmed Bhat of Pattan, Baramulla, was killed in an encounter that started in the Binner area of Baramulla last night. One AK rifle, 2 magazines & 30 rounds recovered: Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/p15JiY1hlH
— ANI (@ANI) July 31, 2022
హందిపొరాలోని రఫియాబాద్ చెకింగ్ పాయింట్ నుంచి తప్పించుకున్న ఇద్దరు ఉగ్రవాదులను సోపోర్ పోలీసులు పట్టుకున్నారు. వారిని తారీఖ్ అహ్ వానీ, ఇష్ఫఖ్ అహ్ వానీగా గుర్తించారు. ఇద్దరు లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు. వారివద్ద రెండు పిస్తోళ్లు, రెండు మ్యాగజైన్లు, 11 లైవ్ కాట్రిజ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
J&K | Two hybrid terrorists of LeT, namely Tariq Ah Wani & Ishfaq Ah Wani, were chased & arrested by Sopore police after they fled from a checking point at Hadipora Rafiabad. Two pistols, two pistol magazines & 11 live cartridges recovered; further probe underway: Police (30.07) pic.twitter.com/hJbYWr4lfN
— ANI (@ANI) July 31, 2022