లక్నో: చిరుతపులి స్కూల్లోని తరగతి గదిలోకి వచ్చింది. ఒక విద్యార్థిపై దాడి చేసింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఛర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్లోని క్లాస్ రూమ్లోకి ఒక పులి చొరబడింది. ఒక విద్యార్థిపై దాడి చేసింది. దీంతో తరగతి గదిలోని విద్యార్థులంతా బయటకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా స్వల్పంగా తొక్కిసలాట జరిగింది.
కాగా, చిరుత దాడికి గురైన విద్యార్థి వీపు, చేతికి గాయాలయ్యాయి. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చిరుత దాడి గురించి పోలీసులు, అటవీశాఖ అధికారులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. మరోవైపు క్లాస్లో చిరుత ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.