టీచర్ పాఠం చెప్తున్నాడు. పిల్లంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుత. సైలెంట్గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో వెలుగు చూసింది. ఇక్కడి చౌదరీ నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్లో జరిగినట్లు సమాచారం.
చిరుత దాడి గురించి తెలిసిన ఇతర విద్యార్థులంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో కాలేజ్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. దీనిలో కొందరు గాయపడ్డారు కూడా. చిరుత దాడి చేసిన విద్యార్థి కూడా తప్పించుకున్నాడు. అతనికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.
అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం వెంటనే ఫారెస్టు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.