లేహ్, ఏప్రిల్ 13: త్వరలో ‘సరిహద్దు మార్చ్’ చేపట్టనున్నట్టు లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) నేత, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ శుక్రవారం వెల్లడించారు. అయితే ర్యాలీ చేపట్టబోయే తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.
లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించడంతోపాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్తో ఇటీవల తలబెట్టిన ఈ బోర్డర్ మార్చ్పై అధికారులు ఆంక్షలు విధించడంతో పాటు ర్యాలీని ఎల్ఏబీ విరమించుకొన్న విషయం తెలిసిందే. కొంత మంది గ్రూపుతో చైనా సరిహద్దులోని చాంగ్తాంగ్ వరకు మార్చ్ చేపడుతామని ఏల్ఏబీ తాజాగా పేర్కొన్నది. లడఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్తో కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(కేడీఏ)తో కలిసి ఎల్ఏబీ గత నాలుగేండ్లుగా ఆందోళనలు చేస్తున్నది.