న్యూఢిల్లీ: లేహ్ ఎయిర్బేస్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ (సీవోవో), గ్రూప్ కెప్టెన్ అజయ్ రాఠీకి వాయుసేన పతకం దక్కింది. వివిధ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినందుకు ఆయన ఈ పతకాన్ని ప్రకటించారు. అజయ్ రాఠీ.. ఆపరేషన్ స్నో లియోపర్డ్, అపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సద్భావన లాంటి వివిధ ఆపరేషన్లలో అజయ్ రాఠీ చాకచక్యంగా వ్యవహరించారు.
అదేవిధంగా ఆర్మీ వైస్ చీఫ్ డిజిగ్నేట్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, లెప్టినెంట్ జనరల్ వైకే జోషి, లెఫ్టినెంట్ కేజేఎస్ ధిల్లాన్, లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్లకు పరమ విశిష్ఠ సేవా పతకాలను ప్రకటించారు. అదేవిధంగా మరో ఆరుగురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. వారిలో ఐదుగురికి మరణానంతరం శౌర్యచక్ర అవార్డు దక్కింది.