ఈసీ ప్యానల్కు లాయర్ రాజీనామా
‘ఈసీతో కలిసి పని చేయలేను’
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తరఫున సుప్రీంకోర్టులో వాదించడానికి ఏర్పాటు చేసిన న్యాయవాదుల బృందంలో సభ్యుడిగా ఉన్న లాయర్ మోహిత్ రామ్ తన పదవికి రాజీనామా చేశారు. ‘ప్రస్తుత ఈసీ పనితీరుకు నేను పాటించే విలువలకు మధ్య చాలా అంతరం ఉన్నది. అందుకే బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాను’ అని రామ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతిలోనూ ఈసీ సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో రామ్ రాజీనామా చేశారు.