ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న సూర్య (24) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు ( Man shot dead ). బోపా పోలీస్స్టేషన్ పరిధిలోని అథాయ్ రోడ్లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్నగర్లో లా చదువుతున్న సూర్య అనే యువకుడు తన స్వగ్రామం భోకహేరీ నుంచి ముజఫర్నగర్కు బైక్పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సూర్య బైకుపై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు పారిపోయారని, ప్రస్తుతం వారి కోసం గాలింపు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.