న్యూఢిల్లీ :అంతరిక్ష పరిశోధనలో మరో ప్రతిష్టాత్మక మిషన్ ‘గగన్యాన్’ను 2025లో చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. తుది ప్రయోగానికి ముందు రోబో ‘వ్యోమిత్ర’ను రోదసిలోకి పంపుతామన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ‘టెస్ట్ ఫ్లైట్స్ను ఈ ఏడాది ప్రయోగిస్తున్నాం. అలాగే వచ్చే ఏడాది.. ఓ భారతీయుడ్ని సముద్రగర్భంలో అత్యంత లోతైన చోటకు పంపిస్తున్నాం’ అని అన్నారు. ‘గగన్యాన్’లో ముగ్గురు వ్యోమగాముల్ని భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది. మూడు రోజుల తర్వాత వారు తిరిగి భూమికి చేరుకుంటారు.