దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షపైగా కరోనా కేసులు నమోదవుతూ ఆందోళన పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా 1,68,063 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే 277 మంది ఈ మహమ్మారికి బలైనట్లు చెప్పారు. నిన్నటతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. సోమవారం నాడు రికార్డు స్థాయిలో ఏకంగా 1.79 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక భాగం మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి చేరుకుంది. అదే విధంగా దేశవ్యాప్తంగా మొత్తం 69,959 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.