మహారాష్ట్రలో కరోనా కేసులపై ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతూనే ఉన్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా వారం రోజుల్లోనే రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో భారీ తేడా నమోదైంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే కూడా అంగీకరించారు. గత వారం రోజుకు 150కి అటుఇటుగా కేసులు నమోదయ్యేవని, కానీ ఇప్పుడు రోజుకు 2000 కేసులు నమోదవుతున్నాయని ఆదిత్య థాకరే చెప్పారు.