బెంగళూరు : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకలోని హవేరీలోని చల్గేరి నివాసి. నవీన్ ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. ఇవాళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో నవీన్ జ్ఞానగౌడ్కు వీడియోకాల్ చేశాడు. క్షేమంగాని ఉన్నానని చెప్పాడు. కుటుంబీకులు నవీన్ ఉన్న అపార్ట్మెంట్పై భారత పతాకాన్ని ఎగుర వేయాలని సూచించగా.. ఇందుకు నవీన్ సైతం అంగీకరించాడు.
ఈ సంభాషణ కొనసాగిన 3 గంటల తర్వాత భారత ప్రభుత్వం నుంచి అధికారులు నవీన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఉక్రెయిన్లో నవీన్ మృతి చెందినట్లు సమాచారం అందించారు. కొద్ది సేపటికి ముందే కొడుకు క్షేమంగా ఉన్నానని చెప్పిన కొడుకు అంతలోనే మృతి చెందాడనే వార్త విన్న తల్లిదండ్రులు హతాశయులయ్యారు. రష్యా-ఉక్రెయిన్కు జరుగుతున్న యుద్ధంలో మెడిసిన్ చదువుకునేందుకు వెళ్లి నవీన్ ప్రాణాలు కోల్పోవడంతో అందరినీ కలచివేసింది. ఉక్రెయిన్లో నవీన్ శేఖరప్ప మృతి చెందినట్లు భారత విదేశాంగ సైతం ధ్రువీకరించింది. అలాగే కర్నాటక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిషనర్ మనోజ్ రాజన్ మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఉక్రెయిన్లో మృతి చెందింది నవీన్ శేఖరప్ప మృతి చెందినట్లు ధ్రువీకరించామన్నారు.
నవీన్ ఏదో కొనుగోలు చేసేందుకు సమీపంలోని సూపర్ మార్కెట్కు వెళ్లి చిక్కుకుపోయి ఉంటాడని, ఆ తర్వాత నవీన్ మరణించాడని స్నేహితుడికి స్థానిక కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. నవీన్ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతాపం వ్యక్తం ప్రకటించారు. మృతుడి తండ్రితో మాట్లాడారు. నవీన్ మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఈ విషయమై విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలింపు కొనసాగుతున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ గంగాను అమలు చేస్తున్నది. గత నెల 26 నుంచి ఇప్పటి వరకు 2వేలకు మందికిపైగా భారతీయులను స్వదేశానికి తరలించింది.